BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

415 ఏళ్ల చరిత్ర.. నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ..!

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 11:19 AM
24 వీక్షణలు

నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో 415 ఏళ్ల చరిత్ర కలిగిన రొట్టెల పండుగ వైభవంగా ప్రారంభమైంది. మొహర్రం మాసం సందర్భంగా నిర్వహించే ఈ విశిష్ట వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

ఈ పండుగలో స్వర్ణాల చెరువు పవిత్ర జలాల్లోకి దిగి భక్తులు రొట్టెలు మార్చుకోవడం ప్రధాన ఆచారం. ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతానం వంటి కోరికలు నెరవేరాలని కోరుతూ రొట్టెలు సమర్పిస్తారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదిలిపెడితే, కోరికలు ఉన్న వారు వాటిని తీసుకోవడం తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసంగా నిలిచింది.

ముస్లింలతో పాటు హిందువులు, ఇతర మతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఈ పండుగ ప్రత్యేకత. కులమతాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపై కలవడంతో ఈ వేడుక మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అద్భుత సంప్రదాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.