BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

415 ఏళ్ల చరిత్ర.. నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ..!

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 11:19 AM
76 వీక్షణలు

నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో 415 ఏళ్ల చరిత్ర కలిగిన రొట్టెల పండుగ వైభవంగా ప్రారంభమైంది. మొహర్రం మాసం సందర్భంగా నిర్వహించే ఈ విశిష్ట వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

ఈ పండుగలో స్వర్ణాల చెరువు పవిత్ర జలాల్లోకి దిగి భక్తులు రొట్టెలు మార్చుకోవడం ప్రధాన ఆచారం. ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతానం వంటి కోరికలు నెరవేరాలని కోరుతూ రొట్టెలు సమర్పిస్తారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదిలిపెడితే, కోరికలు ఉన్న వారు వాటిని తీసుకోవడం తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసంగా నిలిచింది.

ముస్లింలతో పాటు హిందువులు, ఇతర మతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఈ పండుగ ప్రత్యేకత. కులమతాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపై కలవడంతో ఈ వేడుక మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అద్భుత సంప్రదాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.