
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
-చిట్యాల ఎమ్మార్వోకు వినతిపత్రం
NTODAY NEWS: చిట్యాల మండలం
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ చిట్యాల ఎమ్మార్వో విజయకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, ఎడ్ల మహలింగం మాట్లాడుతూ — ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలి అని కోరారు.
ముఖ్య డిమాండ్లు:
జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి.
రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం కూడా దాటకపోవడం వారు ఎంత వెనుకబడ్డారో సూచిస్తుందని అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D(6) ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని గుర్తు చేశారు.
అందువల్ల ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి అని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మనీల్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.
#BCReservation
#42PercentReservation
#MunicipalElections
#SocialJustice
#BCDeclaration
#LocalBodyElections
#Chityala
#TelanganaPolitics
Follow us on
Website
Facebook
Instagram
YouTube