BREAKING
కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే
www.ntodaynews.com

43 ఏళ్ల సేవలకు ముగింపు.. ఊటుకూరులో సీఈఓ వెంకట నర్సయ్యకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 03:35 PM
44 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్)లో 43 ఏళ్లపాటు వివిధ హోదాల్లో సేవలందించిన సంఘ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) అనంత వెంకట నర్సయ్య గత నెల 30న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఊటుకూరు పీఏసీఎస్ కళ్యాణ మండపంలో సంఘ పాలకవర్గం, సిబ్బంది ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఘనంగా సన్మానించారు.

సభకు అధ్యక్షత వహించిన చైర్‌పర్సన్ చెరుకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ, సహకార సంఘంలో దీర్ఘకాలంగా వివిధ బాధ్యతలు నిర్వహించిన వెంకట నర్సయ్య రైతులకు విశేష సేవలు అందించారని కొనియాడారు.

మాజీ తిరువూరు మార్కెట్ కమిటీ చైర్మన్ డీ. సీతారామ ప్రసాద్ మాట్లాడుతూ, పని గంటలతో సంబంధం లేకుండా రైతుల అవసరాలకు స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఎరువులు అందించిన వెంకట నర్సయ్య సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యనమద్ది పుల్లయ్య చౌదరి, సీపీఐ సీనియర్ జిల్లా నాయకుడు పసుపులేటి వెంకయ్య, కాంగ్రెస్ నాయకుడు చెన్నుపాటి శేషగిరిరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆలపాటి ఉమామహేశ్వరరావు, కంభంపాటి బాబు, సీపీఎం మండల నాయకుడు వీరారెడ్డి, టీడీపీ నియోజకవర్గ నాయకులు కందిమళ్ల శేషగిరిరావు, డి. కృష్ణారావు, మానుకొండ రామకృష్ణ, విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్, బ్యాంకు అధికారులు, వివిధ గ్రామాల సహకార సంఘాల ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొని వెంకట నర్సయ్యకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు