
నిద్రమత్తులో డివైడర్ను ఢీకొన్న బైక్
ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు
NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా
చిలకలూరిపేట: నిద్రమత్తులో వాహనం నడపడం ముగ్గురు యువకుల పాలిట శాపమైంది. బాపట్ల నుంచి చిలకలూరిపేట మీదుగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది.
ఘటన వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లా మాటూరు గ్రామానికి చెందిన విజయ్, ఏఫ్రాయుమ్, సతీష్ పని నిమిత్తం బాపట్లకు వెళ్లి తిరిగి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. చిలకలూరిపేట బైపాస్ వద్దకు చేరుకున్న సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపు తప్పి వేగంగా డివైడర్ను ఢీకొట్టింది.
108 సిబ్బంది సకాలంలో స్పందన
ప్రమాద సమయంలో బైక్ వేగంగా ఉండటంతో ముగ్గురు యువకులు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది శోభన్ బాబు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు.
#RoadAccident
#BikeCrash
#SleepyDriving
#Chilakaluripet
#PalnaduDistrict
#BreakingNews
#NtodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube