www.ntodaynews.com
పుల్వామా అమరవీరులకు వెల్గటూర్లో ఘన నివాళి
తెలంగాణ
పుల్వామా అమరవీరులకు వెల్గటూర్లో ఘన నివాళి
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన జవాన్ల స్మరణార్థం వెల్గటూర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం నివాళి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
కార్యక్రమాన్ని మండల ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గండ్ర ప్రతాప్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడే జవాన్ల త్యాగం అమూల్యమని పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. అనంతరం “భారత్ మాతా కీ జై”, “అమరవీరులకు జోహార్” నినాదాలతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ, వార్డ్ సభ్యులు గుండాటి సందీప్ రెడ్డి, నక్క సురేష్, కస్తూరి సుమలత, మల్లేష్ పాల్గొన్నారు. అలాగే బందెల ఉదయ్, పెద్దూరి భరత్, వెలగందుల సంతోష్, గుమ్ముల అజయ్, బొడ్డు సంతోష్, గాలిపెల్లి మహేష్, నరేష్, బోడకుంటి తిరుపతి, రేగుంట నర్సయ్య, లకుమల్ల సాయి, మెరుగు ప్రవీణ్, గుమ్ముల తిరుమలేశ్, పల్లపు నవీన్, బోరే మహేష్, పందిరి వెంకటేష్ తదితరులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#PulwamaMartyrs #Velgatoor #CandleMarch #Tribute #IndianArmy
Follow us on
Website
Facebook
Instagram
YouTube