చింతలపూడి అభివృద్ధే లక్ష్యం.. వేగి లింగేశ్వరస్వామి చెరువు కట్ట సుందరీకరణ పనుల పరిశీలన
చింతలపూడి అభివృద్ధే లక్ష్యం.. వేగి లింగేశ్వరస్వామి చెరువు కట్ట సుందరీకరణ పనుల పరిశీలన
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి, జూలై 21: చింతలపూడి పట్టణంలోని వేగి లింగేశ్వరస్వామి చెరువు కట్ట వద్ద చేపట్టనున్న సుందరీకరణ పనులను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మున్సిపల్ కమిషనర్ రాంబాబు, స్థానిక నాయకులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ముందుగా మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, నాణ్యతపై చర్చించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం వేగి లింగేశ్వరస్వామి చెరువు కట్ట వద్ద చేపట్టనున్న సుందరీకరణ పనులను పరిశీలించి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
చింతలపూడి పట్టణానికి మెరుగైన మౌలిక వసతులు, అందమైన పట్టణ వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.