www.ntodaynews.com
జాతీయ రహదారిపై తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణ
జాతీయ రహదారిపై తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
NTODAY NEWS: తుని
లోడ్ లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు
కో డ్రైవర్ అక్కడికక్కడే మృతి – ముగ్గురికి తీవ్ర గాయాలు
జాతీయ రహదారిపై తుని పట్టణ సమీపంలోని బాబా రాందేవ్ ఆలయం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై నిలిపి ఉన్న లోడ్ లారీని వెనుక నుంచి ట్రావెల్ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో విజయవాడ సమీపంలోని గన్నవరానికి చెందిన కో డ్రైవర్ సుంగా రమేష్ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ గణేష్తో పాటు హైదరాబాద్కు చెందిన యస్వంత్, శ్రీకాకుళం జిల్లా మహేంద్రవాడకు చెందిన సత్యమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురికీ కాళ్లు విరిగినట్లు వైద్యులు తెలిపారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు తుని వద్దకు చేరుకున్న సమయంలో హైవేపై నిలిపి ఉన్న లోడ్ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డ్రైవర్ పక్కన కూర్చున్న కో డ్రైవర్ రమేష్ మృతి చెందాడు. ముందు వరుసలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే తుని పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తక్షణమే తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో వారు ఇతర వాహనాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
#RoadAccident
#Tuni
#NationalHighway
#BusAccident
#LorryAccident
#AndhraPradeshNews
#BreakingNews
#PublicSafety
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube