BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

జాతీయ రహదారిపై తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణ
24 Jan, 2026 - 07:34 PM
307 వీక్షణలు
జాతీయ రహదారిపై తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం NTODAY NEWS: తుని  లోడ్ లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు కో డ్రైవర్ అక్కడికక్కడే మృతి – ముగ్గురికి తీవ్ర గాయాలు జాతీయ రహదారిపై తుని పట్టణ సమీపంలోని బాబా రాందేవ్ ఆలయం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై నిలిపి ఉన్న లోడ్ లారీని వెనుక నుంచి ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడ సమీపంలోని గన్నవరానికి చెందిన కో డ్రైవర్ సుంగా రమేష్ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ గణేష్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన యస్వంత్, శ్రీకాకుళం జిల్లా మహేంద్రవాడకు చెందిన సత్యమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురికీ కాళ్లు విరిగినట్లు వైద్యులు తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు తుని వద్దకు చేరుకున్న సమయంలో హైవేపై నిలిపి ఉన్న లోడ్ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డ్రైవర్ పక్కన కూర్చున్న కో డ్రైవర్ రమేష్ మృతి చెందాడు. ముందు వరుసలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే తుని పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తక్షణమే తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో వారు ఇతర వాహనాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. #RoadAccident #Tuni #NationalHighway #BusAccident #LorryAccident #AndhraPradeshNews #BreakingNews #PublicSafety #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube