BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 09:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నారిని భుజాలపై ఎక్కించుకుని వాగు దాటిన వ్యక్తి

తెలంగాణ
/ కొమురం భీమ్ ఆసిఫాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Sep, 2026 - 09:42 PM
33 వీక్షణలు

ఆసిఫాబాద్ జిల్లా, కెరమెరి: అనార్పల్లి వాగును దాటేందుకు గ్రామస్థులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరంజివాడకు వెళ్లే మార్గంలో వాగులో నీటి ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, రాకపోకలకు సరైన సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లోనే ప్రయాణం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి చిన్నారిని భుజాలపై ఎక్కించుకుని ప్రవహిస్తున్న వాగును దాటుతున్న దృశ్యం స్థానికంగా కలకలం రేపింది. నీటి ప్రవాహం మధ్య చిన్నారిని భుజాలపై మోస్తూ అవతలి ఒడ్డుకు చేరేందుకు చేసిన ప్రయత్నం ప్రమాదకరంగా కనిపించింది. చిన్నారులతో సహా గ్రామస్థులు నిత్యం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలు కురిసిన సమయంలో వాగులో నీటి ప్రవాహం పెరగడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. అనార్పల్లి వాగుపై శాశ్వత వంతెన లేదా సురక్షిత రాకపోకల సౌకర్యం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.