BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఆధార్ నంబర్‌తోనే ఎరువుల కేటాయింపు.. రైతులకు మరింత సులభతరం ఏవో బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
77 వీక్షణలు

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

చాట్రాయి, జూలై 2: రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీ ఎయిమ్స్ (APAIMS) 2.0 విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని మండల వ్యవసాయ అధికారి శివశంకర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం చాట్రాయి మండలంలోని నరసింహారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)ను ఆయన సందర్శించి యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన శివశంకర్, ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ధ్రువీకరణ పూర్తి చేసిన వెంటనే రైతులు తమ పంట విస్తీర్ణం, పంట రకం ఆధారంగా ప్రభుత్వం కేటాయించిన ఎరువుల వివరాలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దఫాల వారీగా ఎంత డీఏపీ, ఎంత యూరియా కేటాయించబడిందో వెబ్‌సైట్‌లో స్పష్టంగా కనిపిస్తుందని, దీంతో ఎరువుల కోసం రైతులు అనవసరంగా తిరిగే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా కౌలు రైతులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములను సాగు చేస్తున్న రైతులు, ఇంకా పట్టాదారు పాస్‌బుక్ పొందని సాగుదారులకు కూడా ఈ విధానం ద్వారా ఎరువులు అందుబాటులోకి రావడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని ఆయన తెలిపారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి పంటల వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయక అధికారుల ద్వారా వెంటనే సవరించుకోవచ్చని సూచించారు.

రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శివశంకర్ పిలుపునిచ్చారు.