BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

ఆధార్ నంబర్‌తోనే ఎరువుల కేటాయింపు.. రైతులకు మరింత సులభతరం ఏవో బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
20 వీక్షణలు

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

చాట్రాయి, జూలై 2: రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీ ఎయిమ్స్ (APAIMS) 2.0 విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని మండల వ్యవసాయ అధికారి శివశంకర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం చాట్రాయి మండలంలోని నరసింహారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)ను ఆయన సందర్శించి యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన శివశంకర్, ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ధ్రువీకరణ పూర్తి చేసిన వెంటనే రైతులు తమ పంట విస్తీర్ణం, పంట రకం ఆధారంగా ప్రభుత్వం కేటాయించిన ఎరువుల వివరాలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దఫాల వారీగా ఎంత డీఏపీ, ఎంత యూరియా కేటాయించబడిందో వెబ్‌సైట్‌లో స్పష్టంగా కనిపిస్తుందని, దీంతో ఎరువుల కోసం రైతులు అనవసరంగా తిరిగే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా కౌలు రైతులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములను సాగు చేస్తున్న రైతులు, ఇంకా పట్టాదారు పాస్‌బుక్ పొందని సాగుదారులకు కూడా ఈ విధానం ద్వారా ఎరువులు అందుబాటులోకి రావడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని ఆయన తెలిపారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి పంటల వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయక అధికారుల ద్వారా వెంటనే సవరించుకోవచ్చని సూచించారు.

రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శివశంకర్ పిలుపునిచ్చారు.