www.ntodaynews.com
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-పీ.కొత్తకోట రైల్వే బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున తిరుపతి వైపు వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతులు, గాయపడినవారు తెలంగాణకు చెందిన వారిగా ప్రాథమిక సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.