BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:49 PM
61 వీక్షణలు

ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలోని కనసానపల్లి గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ మరియు ఆయన సిబ్బంది సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 14 మందిని అరెస్ట్ చేయగా, 5,600 రూపాయలు నగదు, 8 మోటార్ సైకిళ్లను, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆదేశాల మేరకు ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ నేతృత్వంలో ఈ దాడి చేపట్టారు.పోలీసుల సమాచారం మేరకు, కనసానపల్లి గ్రామ శివార్లలో కోడి పందాలు నిర్వహిస్తుండగా, పందెం రాయుళ్లను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.కోడి పందాలు, పేకాట వంటి వ్యసనాల పై ఉక్కుపాదం మోపే వారికోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక.ఎస్ఐ శుభ శేఖర్ తెలిపారు, మండలంలో ఈ తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.కోడి పందాలు, పేకాట వంటి వ్యసనాలు తమ భవిష్యత్తును మరియు కుటుంబ గౌరవాన్ని నాశనం చేస్తాయని, వాటి నుండి దూరంగా ఉండాలని హితవు పలికారు.ఈ తరహా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారాన్ని గోప్యంగా పోలీసులు అందించాలనీ చెప్పారు.అదుపులోకి తీసుకున్న 14 మందిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగించామని పోలీసులు వెల్లడించారు.