BREAKING
చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ
www.ntodaynews.com

ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:49 PM
22 వీక్షణలు

ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలోని కనసానపల్లి గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ మరియు ఆయన సిబ్బంది సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 14 మందిని అరెస్ట్ చేయగా, 5,600 రూపాయలు నగదు, 8 మోటార్ సైకిళ్లను, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆదేశాల మేరకు ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ నేతృత్వంలో ఈ దాడి చేపట్టారు.పోలీసుల సమాచారం మేరకు, కనసానపల్లి గ్రామ శివార్లలో కోడి పందాలు నిర్వహిస్తుండగా, పందెం రాయుళ్లను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.కోడి పందాలు, పేకాట వంటి వ్యసనాల పై ఉక్కుపాదం మోపే వారికోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక.ఎస్ఐ శుభ శేఖర్ తెలిపారు, మండలంలో ఈ తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.కోడి పందాలు, పేకాట వంటి వ్యసనాలు తమ భవిష్యత్తును మరియు కుటుంబ గౌరవాన్ని నాశనం చేస్తాయని, వాటి నుండి దూరంగా ఉండాలని హితవు పలికారు.ఈ తరహా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారాన్ని గోప్యంగా పోలీసులు అందించాలనీ చెప్పారు.అదుపులోకి తీసుకున్న 14 మందిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగించామని పోలీసులు వెల్లడించారు.