BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 07:26 PM
72 వీక్షణలు

విశాఖపట్నంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన కిరాణా హోల్‌సేల్ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్ ప్లాంట్లపై జాయింట్ కలెక్టర్ విద్యాధరి కఠిన చర్యలు తీసుకున్నారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.6.5 లక్షల జరిమానా విధించడంతో పాటు, మరో వాటర్ ప్లాంట్ లైసెన్స్‌ను రద్దు చేశారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2006 చట్టం ప్రకారం విశాఖలోని 12 సంస్థలపై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యత లేని ధాన్యాలు, పప్పులు, ఆహార పదార్థాల విక్రయం, కృత్రిమ రంగుల వినియోగం, చికెన్ లాలిపాప్, ఫ్రైల్లో నాసిరకం పదార్థాల వాడకం, గడువు ముగిసిన పానీయాలు, పాడైన ఆహార పదార్థాల విక్రయం వంటి అంశాలపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి, ఆహార భద్రతాధికారి జీవీ అప్పారావు నమోదు చేసిన కేసులను శుక్రవారం సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.