BREAKING
మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు ​జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్‌లో పోస్టర్ల ఆవిష్కరణ ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ... చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు ​జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్‌లో పోస్టర్ల ఆవిష్కరణ ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ... చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం
www.ntodaynews.com

ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 07:26 PM
15 వీక్షణలు

విశాఖపట్నంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన కిరాణా హోల్‌సేల్ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్ ప్లాంట్లపై జాయింట్ కలెక్టర్ విద్యాధరి కఠిన చర్యలు తీసుకున్నారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.6.5 లక్షల జరిమానా విధించడంతో పాటు, మరో వాటర్ ప్లాంట్ లైసెన్స్‌ను రద్దు చేశారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2006 చట్టం ప్రకారం విశాఖలోని 12 సంస్థలపై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యత లేని ధాన్యాలు, పప్పులు, ఆహార పదార్థాల విక్రయం, కృత్రిమ రంగుల వినియోగం, చికెన్ లాలిపాప్, ఫ్రైల్లో నాసిరకం పదార్థాల వాడకం, గడువు ముగిసిన పానీయాలు, పాడైన ఆహార పదార్థాల విక్రయం వంటి అంశాలపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి, ఆహార భద్రతాధికారి జీవీ అప్పారావు నమోదు చేసిన కేసులను శుక్రవారం సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.