BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 07:26 PM
109 వీక్షణలు

విశాఖపట్నంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన కిరాణా హోల్‌సేల్ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్ ప్లాంట్లపై జాయింట్ కలెక్టర్ విద్యాధరి కఠిన చర్యలు తీసుకున్నారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.6.5 లక్షల జరిమానా విధించడంతో పాటు, మరో వాటర్ ప్లాంట్ లైసెన్స్‌ను రద్దు చేశారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2006 చట్టం ప్రకారం విశాఖలోని 12 సంస్థలపై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యత లేని ధాన్యాలు, పప్పులు, ఆహార పదార్థాల విక్రయం, కృత్రిమ రంగుల వినియోగం, చికెన్ లాలిపాప్, ఫ్రైల్లో నాసిరకం పదార్థాల వాడకం, గడువు ముగిసిన పానీయాలు, పాడైన ఆహార పదార్థాల విక్రయం వంటి అంశాలపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి, ఆహార భద్రతాధికారి జీవీ అప్పారావు నమోదు చేసిన కేసులను శుక్రవారం సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.