ఆంధ్రప్రదేశ్ను ఏఐ & డీప్ టెక్ హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు
రష్యాకు చెందిన ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భారతదేశంలోని బ్యాంకింగ్, ప్రజా పరిపాలన, రిటైల్ రంగాల్లో స్బేర్ బ్యాంక్ అభివృద్ధి చేసిన గిగాచాట్ ఎల్ఎల్ఎం సాంకేతికతను విస్తరించే అవకాశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ (ఏఐ), డీప్ టెక్ ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ సాంకేతిక భాగస్వామ్యాల ద్వారా పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు చర్యలు చేపడుతోంది.
భవిష్యత్ సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడంతో పాటు, ప్రపంచ ఏఐ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ఈ ప్రయత్నాల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.