BREAKING
ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం
www.ntodaynews.com

ఆరేళ్ల తర్వాత మళ్లీ విద్యుత్ ఉత్పత్తి....

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 09:43 AM
13 వీక్షణలు

ఆరేళ్ల తర్వాత మళ్లీ విద్యుత్ ఉత్పత్తి.. నేడు శ్రీశైలం నాలుగో యూనిట్‌లో ట్రయల్ రన్

శ్రీశైలం, ఆగస్టు 10: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్‌లో సోమవారం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతమైతే యూనిట్‌ను విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఉత్పత్తిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీంతో సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ఈ యూనిట్‌లో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది.

2020 ఆగస్టులో బ్యాటరీల మార్పు సమయంలో సంభవించిన షార్ట్‌సర్క్యూట్ కారణంగా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ఉద్యోగులు మృతి చెందారు. ప్రమాదం అనంతరం నాలుగో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

తాజాగా యూనిట్ పునరుద్ధరణ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్‌కు అధికారులు సిద్ధమయ్యారు. ట్రయల్ రన్ సందర్భంగా యంత్రాల పనితీరు, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అన్ని పరీక్షలు సంతృప్తికరంగా పూర్తయితే గ్రిడ్‌కు అనుసంధానం చేసి వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.