ఆరోగ్య కేంద్రానికి వాటర్ డిస్పెన్సర్ అందజేత
పెనుగొలను, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆరోగ్య కేంద్రానికి శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వాటర్ డిస్పెన్సర్ అందజేశారు.
ఈ సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ సురేష్ మాట్లాడుతూ, వాటర్ డిస్పెన్సర్ ఆరోగ్య కేంద్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దీనివల్ల రోగులకు అవసరమైనప్పుడు వేడి నీరు, చల్లని తాగునీరు అందించేందుకు వీలవుతుందని చెప్పారు.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ షేక్ సుల్తానా మాట్లాడుతూ, ఆరోగ్య కేంద్రానికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆర్గనైజర్ వెదురు వెంకటరెడ్డి, కమిటీ సభ్యులను అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రత్నమాల, ఎంపీహెచ్ఏ పుల్లారావు, తోలేటి జయసింహ, ఇనపనూరి శంకరరావు, మీనుగు కృష్ణ, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.