BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 03:20 PM
71 వీక్షణలు

ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని డిమాండ్

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం సమావేశంలో, తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు గతంలో అమల్లో ఉన్న ప్రయాణ రాయితీలను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం అభినందనీయమని పేర్కొంటూనే, అదే విధంగా వయోవృద్ధుల పట్ల కూడా ప్రభుత్వం సమాన దృష్టి సారించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం మరియు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గజెల్లి వెంకటయ్య, జెట్టి మురహరి, ఆర్. రాజన్న, ఆది రాజయ్య, మాదరబోయిన మల్లేష్, గుజ్జ శంకర్, ముత్యాల రాయమల్లు, గుజ్జ మల్లేష్, సల్లూరు గణపతి తదితరులు పాల్గొని, సింగరేణి విశ్రాంత ఉద్యోగులతో సహా రాష్ట్రంలోని వయోవృద్ధులందరికీ ఈ రాయితీ సౌకర్యాన్ని వెంటనే వర్తింపజేయాలని నినదించారు