ఆరుగొలనుపేటలో ఎంపీయుపీ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ బ్యాగులు, పుస్తకాల పంపిణీ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎం. చంద్రు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన స్కూల్ బ్యాగులు, పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పానుగళ్ళ కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఇజ్జిగాని వెంకటేశ్వరావు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఈడా శ్రీనివాసరావు, ప్రసాదు, అబ్రహం, సీతయ్తయ దితరులు పాల్గొన్నారు.