ఆషాఢ మాసం సందర్భంగా రాట్నాల అమ్మవారికి సారె సమర్పించిన గ్రామ ఆడపడుచులు
ఆషాఢ మాసం సందర్భంగా రాట్నాల అమ్మవారికి సారె సమర్పించిన గ్రామ ఆడపడుచులు
ఏలూరు జిల్లా, పెదవేగి మండలం, రాట్నాలకుంట, ఆగస్టు 6: ఆషాఢ మాసం సందర్భంగా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన రాట్నాల అమ్మవారికి గ్రామ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి సారె తీసుకువచ్చిన మహిళలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరణ చేసి, కొబ్బరికాయలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ సారె సమర్పణ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.