BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఆషాఢ మాసం సందర్భంగా రాట్నాల అమ్మవారికి సారె సమర్పించిన గ్రామ ఆడపడుచులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 07:23 PM
32 వీక్షణలు

ఆషాఢ మాసం సందర్భంగా రాట్నాల అమ్మవారికి సారె సమర్పించిన గ్రామ ఆడపడుచులు

ఏలూరు జిల్లా, పెదవేగి మండలం, రాట్నాలకుంట, ఆగస్టు 6: ఆషాఢ మాసం సందర్భంగా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన రాట్నాల అమ్మవారికి గ్రామ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి సారె తీసుకువచ్చిన మహిళలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరణ చేసి, కొబ్బరికాయలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ సారె సమర్పణ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.