ఆత్కూరులో ఘనంగా ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
ఆత్కూరులో ఘనంగా ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో మంగళవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్కూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఈమని శ్రీనివాసరావు, చెవుటూరు పీఏసీ అధ్యక్షుడు ఈమని మురళీకృష్ణ, జి.కొండూరు మండల ఎస్సీసీఎల్ నాయకుడు బద్దెర వెంకటేశ్వరరావు, 145వ బూత్ కన్వీనర్ మంద ఇస్రాయేలు, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి ఏడుకొండలు, గంగుల ఏడుకొండలు, పటాపంచల రామారావు, బొర్రా వెంకట్రావు, మెండెం వెంకటరావు, మెండెం నాగేశ్వరరావు, మెండెం చినబాబు తదితరులు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.