BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ఆవేశంలో నిర్ణయాలు వద్దు – చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 02:39 PM
67 వీక్షణలు

ఆవేశంలో నిర్ణయాలు వద్దు – చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ కీలక సూచనలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఎస్సై డి. రామకృష్ణ కీలక సూచనలు చేశారు. పరీక్ష ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పరీక్ష ఫలితాలు అనుకున్న విధంగా రాకపోయినా నిరుత్సాహానికి లోనవ్వకుండా ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మళ్లీ రాసి విజయాన్ని సాధించే అవకాశం ఉందని తెలిపారు.

క్షణిక నిరాశ లేదా ఆవేశంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని, జీవితం ఎంతో విలువైనదని ఆయన స్పష్టం చేశారు. ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించదని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు గుర్తుచేశారు.

అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలపై అధిక ఒత్తిడి చేయకుండా, ఫలితాలు ఎలా వచ్చినా వారికి అండగా నిలవాలని సూచించారు. పిల్లలు మానసికంగా దృఢంగా ఉండేలా ప్రోత్సహిస్తూ, వారికి అవసరమైన సహకారం అందించాలని కోరారు.