BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.. మహిళా సంఘాల భవనాలపై మంత్రి అడ్లూరి కీలక ఆదేశాలు!

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
22 Mar, 2026 - 02:32 PM
111 వీక్షణలు

బుగ్గారం: ప్రభుత్వ భవనాల నిర్మాణంలో మరియు ఇతర అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం బుగ్గారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఘనంగా శంకుస్థాపన చేశారు.

​రూ. 65 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం:

బుగ్గారంలో రూ. 25 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు, రూ. 10 లక్షలతో నిర్మించే మహిళా సంఘాల వీవో భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే వెల్గొండ గ్రామంలో రూ. 5 లక్షలతో డ్రైనేజీ పనులు, రూ. 15 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ. 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

​అధికారులపై బాధ్యత:

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల అవసరాల కోసం నిర్మించే ప్రతి పనిలో నాణ్యత ఉండాలని, కాంట్రాక్టర్ల ద్వారా నాణ్యమైన పనులు చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. నాణ్యతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

​మహిళా సంఘాలకు పెద్దపీట:

నియోజకవర్గంలో మహిళా సంఘాల కోసం నిర్మించే వీవో భవనాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని త్వరగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. ఈ భవనాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కోసం అదనపు నిధులు కేటాయించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.