అభివృద్ధి.. సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
సుప్రియన్ పేటలో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ కార్యక్రమం
నగరం: అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన నినాదమని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. నగరంలోని సుప్రియన్ పేటలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం” కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, స్త్రీ శక్తి పథకం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం తదితర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం సుప్రియన్ పేటలో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నాయకులు శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు తాటి అప్పారావు, గ్రంథాలయ చైర్మన్ తనగల అనిల్, సొసైటీ చైర్మన్ తిరుమెల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు