అడవి పంది అడ్డం రావడంతో బైక్ నుండి కింద పడి తీవ్ర గాయాలై వ్యక్త వ్యక్తి మృతి...
అడవి పంది అడ్డం రావడంతో బైక్ నుండి కింద పడి తీవ్ర గాయాలై వ్యక్త వ్యక్తి మృతి...
చిత్తూరు జిల్లా.
బంగారుపాలెం.
అడవి పంది అడ్డం రావడంతో బైక్ నుండి కింద పడి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం మేరకు ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బంగారుపాలెం మండలం కీరమంద గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి పెయింటర్ గా పనిచేస్తూ వృత్తిరీత్యా పలమనేరు లో పెయింటింగ్ పని పూర్తిచేసుకుని , ద్విచక్ర వాహనంలో మొగిలి ఘాట్ రెండవ స్పీడ్ బ్రేకర్ వద్ద వస్తూ ఉండగా ఒక అడవి పంది ద్విచక్ర వాహనానికి అడ్డం రావడంతో సడన్గా బ్రేక్ పట్టి కిందపడి స్పీడ్ బ్రేకర్ పక్కన ఉన్న రైలింగ్కు తల తగిలి తీవ్ర గాయాలయిందని, స్థానికుల సమాచారం మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య సేవల నిమిత్తం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించామన్నారు. బుధవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని బాలాజీ తండ్రి జగన్నాథం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుడికి భార్య గీతాంజలి ఒక కొడుకు కూతురు ఉన్నట్లు తెలిపారు