BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీ స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 01:37 PM
38 వీక్షణలు

అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీ స్వాధీనం

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు

ఏలూరు జిల్లా, చింతలపూడి, జూలై 19: అక్రమ ఇసుక రవాణాపై చింతలపూడి పోలీసులు చర్యలు చేపట్టారు. రేచర్ల సమీపంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీని ఆదివారం ఎస్సై సతీష్ తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, లారీలో నిబంధనల ప్రకారం 28 టన్నుల ఇసుక మాత్రమే ఉండాల్సి ఉండగా, అదనంగా సుమారు 15 టన్నులు లోడ్ చేసి మొత్తం 43 టన్నులతో తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో లారీని స్వాధీనం చేసుకుని చింతలపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న లారీని తదుపరి చర్యల కోసం రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించనున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై సతీష్ హెచ్చరించారు.