అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీ స్వాధీనం
అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీ స్వాధీనం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా, చింతలపూడి, జూలై 19: అక్రమ ఇసుక రవాణాపై చింతలపూడి పోలీసులు చర్యలు చేపట్టారు. రేచర్ల సమీపంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీని ఆదివారం ఎస్సై సతీష్ తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, లారీలో నిబంధనల ప్రకారం 28 టన్నుల ఇసుక మాత్రమే ఉండాల్సి ఉండగా, అదనంగా సుమారు 15 టన్నులు లోడ్ చేసి మొత్తం 43 టన్నులతో తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో లారీని స్వాధీనం చేసుకుని చింతలపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు.
స్వాధీనం చేసుకున్న లారీని తదుపరి చర్యల కోసం రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు అప్పగించనున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై సతీష్ హెచ్చరించారు.