www.ntodaynews.com
ఆషాడ మాసం తొలి ఆదివారం గంగమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
ఆషాడ మాసం తొలి ఆదివారం గంగమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ
పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల, జూలై 19 (ఏపీ హైలెట్స్): ఆషాడ మాసం ప్రారంభమైన తొలి ఆదివారం సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు కొనసాగాయి.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఆషాడ మాసం తొలి ఆదివారం కావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.