ముక్కంపాడులో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ముక్కంపాడు: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలోని ముక్కంపాడు గ్రామంలో సుమారు రూ.30 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.
చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదేశాలతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో రహదారి సౌకర్యం మెరుగుపడటంతో ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు సహకరిస్తామని వారు తెలిపారు.