www.ntodaynews.com
ఒకే దేశం – ఒకే ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధం
జాతీయం
ఒకే దేశం – ఒకే ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధం
న్యూఢిల్లీ, జూలై 19: దేశంలో ఒకే దేశం – ఒకే ఎన్నిక (వన్ నేషన్, వన్ ఎలక్షన్) విధానాన్ని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది.
లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలంటే కనీసం ఆరు నెలల ముందుగానే సమాచారం అందిస్తే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయగలమని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈ విధానానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్ 2028లో ఆమోదిస్తే, 2029 నుంచే అమలు చేసేందుకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేసింది.
దేశ ఎన్నికల వ్యవస్థలో ప్రతిపాదిత అతిపెద్ద సంస్కరణలలో ఒకటిగా భావిస్తున్న ఒకే దేశం – ఒకే ఎన్నిక విధానం అమలుకు ఎన్నికల సంఘం చేసిన ఈ ప్రకటన కీలక పరిణామంగా భావిస్తున్నారు.