BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

10వ తరగతి విద్యార్థులకు దత్తత కార్యక్రమం

తెలంగాణ
13 Jan, 2026 - 05:52 AM
76 వీక్షణలు

కొండమడుగు గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు దత్తత కార్యక్రమం ప్రారంభం

విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటే లక్ష్యం NTODAY NEWS:  బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం దత్తత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను అదే గ్రామానికి చెందిన యువత, విద్యావంతులు స్వచ్ఛందంగా దత్తత తీసుకుని, ఇప్పటి నుంచి వార్షిక పరీక్షలు వచ్చే వరకు వారి చదువుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ, విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులు అయ్యేలా బాధ్యత తీసుకోవడం అభినందనీయమైన చర్య అని తెలిపారు. అలాగే 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఇంట్లో టీవీలను ఆపి, చదువుపై దృష్టి పెట్టేలా సహకరించాలని అన్నారు. విద్యార్థులు ఆటలు, పాటలను పక్కన పెట్టి ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లేచి శ్రద్ధగా చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి విద్య జీవితంలో అత్యంత కీలక దశ అని, ఇక్కడ ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత చదువులకు మార్గం సుగమమవుతుందని, జీవితంలో స్థిరపడాలంటే పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అని తెలిపారు. #StudentAdoptionProgram #EducationForAll #Class10Students #YadadriBhuvanagiri #BBNagar #RuralEducation #DistrictAdministration #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube