ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్గా కొంపల్లి సూర్య నియామకం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నల్గొండ జిల్లా కన్వీనర్గా చిట్యాల మండలానికి చెందిన విద్యార్థి నాయకుడు కొంపల్లి సూర్య నియమితులయ్యారు. ఈ నెల 22 నుండి 25 వరకు కరీంనగర్లో నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రావుల కృష్ణ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం కొంపెల్లి సూర్య మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నారు. ఈ సందర్భంగా కొంపల్లి సూర్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో నల్గొండ జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సూర్య నియామకం పట్ల పలువురు విద్యార్థి నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.