BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా కొంపల్లి సూర్య నియామకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 May, 2026 - 08:57 AM
219 వీక్షణలు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నల్గొండ జిల్లా కన్వీనర్‌గా చిట్యాల మండలానికి చెందిన విద్యార్థి నాయకుడు కొంపల్లి సూర్య నియమితులయ్యారు. ఈ నెల 22 నుండి 25 వరకు కరీంనగర్‌లో నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రావుల కృష్ణ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం కొంపెల్లి  సూర్య మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నారు. ​ఈ సందర్భంగా కొంపల్లి సూర్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో నల్గొండ జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సూర్య నియామకం పట్ల పలువురు విద్యార్థి నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.