ఏఎస్ పేట తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు
రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన తహసిల్దార్ డి.ఎస్.స్వరూప్
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల తహసిల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ డి.ఎస్.స్వరూప్, పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పు (మ్యూటేషన్) చేయడానికి ఓ రైతు వద్ద రూ.20 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు అధికారులు వలపన్ని తహసిల్దార్ను లంచం తీసుకుంటున్న సమయంలోనే రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
తరువాత ఏసీబీ అధికారులు కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అవినీతి నిరోధక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.