BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఏఎస్ పేట తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 10:30 PM
88 వీక్షణలు

రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసిల్దార్ డి.ఎస్.స్వరూప్

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల తహసిల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ డి.ఎస్.స్వరూప్, పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పు (మ్యూటేషన్) చేయడానికి ఓ రైతు వద్ద రూ.20 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు అధికారులు వలపన్ని తహసిల్దార్‌ను లంచం తీసుకుంటున్న సమయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తరువాత ఏసీబీ అధికారులు కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అవినీతి నిరోధక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.