చనుబండ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుక ఘనంగా నిర్వహించబడింది.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుక ఘనంగా నిర్వహించబడింది.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కందుల కృష్ణ మాట్లాడుతూ విద్య ద్వారానే విముక్తి లభిస్తుందని నమ్మి, సమాజంలో పేరుకుపోయిన అసమానతలపై రాజీలేని పోరాటం చేసిన ధన్యజీవి పూలే. ముఖ్యంగా మహిళా విద్య కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన వేసిన పునాదులు నేటికీ మనందరికీ మార్గదర్శకాలు. ఆయన ఆశయ సాధనలో భాగస్వాములవుతూ, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం పునరంకితమవ్వడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ములగలాపాటి శ్రీనివాసరావు, నూజివీడు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజషన్ సెక్రటరీ మోదుగు లక్ష్మి విమలకుమారి, దార్ల సురేష్, మోదుగు ముత్తయ్య, నక్కా చెన్నారావు, విస్సంపల్లి రాజ, బీసీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.