www.ntodaynews.com
ఏలూరు జిల్లా పర్యటనలో హైకోర్టు న్యాయమూర్తికి ఎస్పీ స్వాగతం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా పర్యటనలో హైకోర్టు న్యాయమూర్తికి ఎస్పీ స్వాగతం
ఏలూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డిని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి న్యాయమూర్తికి స్వాగతం పలికారు. జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడే విధంగా పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.