BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

చిలకలూరిపేటలో హైటెన్షన్‌.. మృతుల కుటుంబాల ఆందోళన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం అందలేదని నిరసన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 03:51 PM
30 వీక్షణలు

చిలకలూరిపేటలో నిన్న రాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్వయంగా తమ వద్దకు వచ్చి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే తమ వద్దకు రాకపోతే మృతదేహాలతో ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.

మృతుల కుటుంబాల ఆందోళన నేపథ్యంలో చిలకలూరిపేట ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.