BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ఏలూరు జిల్లాలో పెళ్లి పేరుతో ఘరానా మోసం.. 40 మంది మహిళల జీవితాలతో చెలగాటం!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:09 AM
58 వీక్షణలు

ఏలూరు జిల్లా ముదినేపల్లి పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర మోసగాడు సాంబశివరావు చిక్కాడు. మాట్రిమోనియల్ వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని తాను ప్రముఖ కంపెనీ సీఈవోనని నమ్మిస్తూ వివాహం పేరుతో మహిళలను మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడు ఇప్పటికే సుమారు 40 మంది మహిళలను లక్ష్యంగా చేసుకుని భారీగా నగదు, బంగారం, విలువైన వస్తువులు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. పెళ్లి బాసికలు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలతో నమ్మకం కల్పించి, అనంతరం 8 కాసుల బంగారం, కారు, ఏటీఎం కార్డులు సహా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునే పథకం అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముదినేపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి బంగారం, కారు, ఏటీఎం కార్డులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని బాధితులు ఉండే అవకాశం ఉన్నందున దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసు వివరాలను ఏలూరు జిల్లా ఎస్పీ కె. శివ ప్రతాప్ కిషోర్ మీడియాకు వెల్లడించారు. వివాహ సంబంధాల కోసం మాట్రిమోనియల్ సైట్లను వినియోగించే వారు పూర్తి స్థాయిలో వ్యక్తుల వివరాలను ధృవీకరించుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని ఎస్పీ సూచించారు.