BREAKING
సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వార్షిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 06:24 PM
48 వీక్షణలు

ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ బుధవారం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, వివిధ విభాగాల పనితీరును ఎస్పీ సమీక్షించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీసిన ఆయన, దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

ప్రజల భద్రత కోసం శక్తి యాప్ ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు తరచూ పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

కేసుల విచారణలో జాప్యం లేకుండా కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమావేశమైన ఎస్పీ, క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని, అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు.

ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ, డి. శ్రావణ్ కుమార్, కె. రామకృష్ణ, వి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.