www.ntodaynews.com
ఏలూరులో టీడీపీ జిల్లా నూతన కార్యాలయానికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరులో టీడీపీ జిల్లా నూతన కార్యాలయానికి శంకుస్థాపన
ఏలూరులో తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి జిల్లా కార్యాలయం కీలక కేంద్రంగా మారుతుందని తెలిపారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.