BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

ఏపీ అసెంబ్లీలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:00 AM
28 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పరంగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,65,570 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

తదుపరి స్థానాల్లో పాణ్యం (1,54,460), గాజువాక (1,53,505), చంద్రగిరి (1,47,522), తిరుపతి (1,44,295), మంగళగిరి (1,41,514), పెనమలూరు (1,40,953), రంపచోడవరం (1,40,090), పెందుర్తి (1,39,430), గురజాల (1,38,055), విశాఖపట్నం నార్త్ (1,37,949), కోవూరు (1,37,063) నియోజకవర్గాలు ఉన్నాయి.

అలాగే కర్నూలు (1,36,672), విజయవాడ ఈస్ట్ (1,35,996), విజయవాడ సెంట్రల్ (1,35,763), గుంటూరు వెస్ట్ (1,35,311), గన్నవరం (1,34,847), మైలవరం (1,34,785), నెల్లూరు రూరల్ (1,34,323), తెనాలి (1,33,452), నంద్యాల (1,32,924), అనంతపురం అర్బన్ (1,32,802), ఇచ్ఛాపురం (1,32,642), కడప (1,32,431), శ్రీకాకుళం (1,32,230) నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య లక్షా ముప్పై వేలకుపైగా ఉంది.

రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కాకినాడ సిటీ, భీమవరం, మదనపల్లె, కావలి, ప్రొద్దుటూరు, ఒంగోలు, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్ వంటి ప్రధాన పట్టణ నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది.

తాడిపత్రి నియోజకవర్గంలో 1,19,334 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతుండటం రాజకీయ పార్టీల వ్యూహాల్లో కీలక అంశంగా మారింది.