BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

ఏపీ పాఠశాలల్లో ఏఐతో హాజరు నమోదు.. గ్రూప్ ఫొటో తీస్తే చాలు అటెండెన్స్ ఆటోమేటిక్!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
15 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును మరింత ఆధునికంగా మార్చేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తూ కొత్త హాజరు విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ సాంకేతికతలో విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, తరగతి మొత్తం కలిసి ఒక గ్రూప్ ఫొటో తీస్తే, అందులో ఉన్న విద్యార్థుల హాజరు స్వయంచాలకంగా నమోదవుతుంది.

ఈ విధానం అమల్లోకి వస్తే ఉపాధ్యాయుల సమయం ఆదా కావడంతో పాటు హాజరు నమోదులో ఖచ్చితత్వం, పారదర్శకత మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రయోగాత్మక దశ విజయవంతమైతే, ఈ విధానాన్ని త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించే అవకాశం ఉంది