BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్ జారీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 02:52 PM
77 వీక్షణలు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్ జారీ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామ సర్వీసు ఇనాం భూములను ఫ్రీహోల్డ్ చేసిన ప్రభుత్వం, తాజాగా షరతులతో ఉన్న (కండీషనల్) పట్టా భూములకూ అదే సడలింపు ఇచ్చింది.

రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలో మొత్తం 33,440.62 ఎకరాల కండీషనల్ పట్టా భూములు ఉండగా, వాటిలో 33,012.35 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో ఇప్పటివరకు షరతులతో పరిమితమైన భూములపై యజమానులకు పూర్తి హక్కులు లభించనున్నాయి. ముఖ్యంగా, ఈ భూములను ఇకపై స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం కలగడం రైతులు, భూస్వాములకు పెద్ద ఊరటగా మారనుంది.

భూవ్యవస్థలో పారదర్శకత పెంచడం, భూస్వాముల హక్కులను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.