BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్ జారీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 02:52 PM
62 వీక్షణలు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్ జారీ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామ సర్వీసు ఇనాం భూములను ఫ్రీహోల్డ్ చేసిన ప్రభుత్వం, తాజాగా షరతులతో ఉన్న (కండీషనల్) పట్టా భూములకూ అదే సడలింపు ఇచ్చింది.

రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలో మొత్తం 33,440.62 ఎకరాల కండీషనల్ పట్టా భూములు ఉండగా, వాటిలో 33,012.35 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో ఇప్పటివరకు షరతులతో పరిమితమైన భూములపై యజమానులకు పూర్తి హక్కులు లభించనున్నాయి. ముఖ్యంగా, ఈ భూములను ఇకపై స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం కలగడం రైతులు, భూస్వాములకు పెద్ద ఊరటగా మారనుంది.

భూవ్యవస్థలో పారదర్శకత పెంచడం, భూస్వాముల హక్కులను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.