ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్ జారీ
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్ జారీ
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామ సర్వీసు ఇనాం భూములను ఫ్రీహోల్డ్ చేసిన ప్రభుత్వం, తాజాగా షరతులతో ఉన్న (కండీషనల్) పట్టా భూములకూ అదే సడలింపు ఇచ్చింది.
రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలో మొత్తం 33,440.62 ఎకరాల కండీషనల్ పట్టా భూములు ఉండగా, వాటిలో 33,012.35 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో ఇప్పటివరకు షరతులతో పరిమితమైన భూములపై యజమానులకు పూర్తి హక్కులు లభించనున్నాయి. ముఖ్యంగా, ఈ భూములను ఇకపై స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం కలగడం రైతులు, భూస్వాములకు పెద్ద ఊరటగా మారనుంది.
భూవ్యవస్థలో పారదర్శకత పెంచడం, భూస్వాముల హక్కులను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.