ఏపీలో భారీ వర్ష సూచన.. 12 జిల్లాలకు అలర్ట్!
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఆరు జిల్లాలకు ‘రెడ్ అలెర్ట్’ జారీ.
మరో ఆరు జిల్లాలకు ‘ఆరెంజ్ అలెర్ట్’ ప్రకటింపు.
గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం.
పిడుగులు, చెట్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.
చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండొద్దని సూచన.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి.
రైతులు, మత్స్యకారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.