www.ntodaynews.com
ఏపీ ఎంపీడీవోలకు డీడీవోలుగా పదోన్నతి..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా,పుంగనూరు ప్రతినిధి
రాష్ట్రంలో 42 మంది ఎంపీడీవోలను పదోన్నతిపై డివిజనల్ డెవలప్మెంట్ అధికారులుగా (డీడీవో) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఇప్పటికే డీడీవోలుగా పనిచేస్తున్న 15 మందిని డ్వామాలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు (ఏపీడీ)గా నియమిస్తూ పంచాయతీరాజ్ గ్రామీ ణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులిచ్చారు.
వీరితోపాటు మరికొందరు ఎంపీడీవోలను పదోన్నతిపై ఏపీడీ, డీడీవోలుగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న 9 మందికి పోస్టింగులు ఇచ్చారు...