www.ntodaynews.com
తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు: అశ్వినీ వైష్ణవ్
తెలంగాణ
హైదరాబాద్, జూలై 11: దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు బుల్లెట్ రైలు మార్గాల్లో మూడు తెలంగాణకు కేటాయించినట్లు కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులు అమల్లోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 35 నిమిషాలు, పుణేకు 2 గంటలు, ముంబైకి 2 గంటల 20 నిమిషాలు, విజయవాడకు కేవలం 70 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
అదేవిధంగా, సమాచార సాంకేతిక రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో సంప్రదాయ సాఫ్ట్వేర్ సేవల నుంచి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికతల వైపు పరిశ్రమలు మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.