BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

గానకోకిల ఎస్. జానకి కన్నుమూత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 10:38 PM
15 వీక్షణలు

దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి శనివారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. ఈ వార్తతో భారతీయ సినీ, సంగీత ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఎస్. జానకి, ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగంలో అపూర్వ సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తం 17 భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించి అత్యంత ప్రతిభావంతమైన నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు.

"దక్షిణ భారత కోకిల", "గానకోకిల"గా అభిమానులు ఆప్యాయంగా పిలిచే జానకి, గ్రామీణ జానపద గీతాల నుంచి శాస్త్రీయ సంగీతం, మెలోడీ పాటలు, భక్తి గీతాల వరకు తన అసాధారణ గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఆమె గాత్రం తరతరాల సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

జాతీయ చలనచిత్ర అవార్డులు సహా అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న ఎస్. జానకి సేవలు భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆమె మరణంపై సినీ, సంగీత, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నారు.