www.ntodaynews.com
చెక్ బౌన్స్ కేసులో రాజ్పాల్ యాదవ్కు మూడు నెలల జైలు శిక్ష
జాతీయం
బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్కు చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు గతంలో విధించిన ఆరు నెలల జైలు శిక్షను హైకోర్టు మూడు నెలలకు తగ్గించింది.
ఈ కేసులో జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తీర్పు వెలువరించారు. అయితే, తీర్పు అమలుపై రెండు నెలల పాటు స్టే విధిస్తూ, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా కల్పించారు. ఈ తీర్పుపై రాజ్పాల్ యాదవ్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన వెల్లడించలేదు.