www.ntodaynews.com
నెట్వర్క్ లేని ప్రాంతాల్లోనూ పనిచేసే బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్
జాతీయం
న్యూఢిల్లీ నెట్వర్క్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించేందుకు బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధరను రూ.1.34 లక్షలుగా నిర్ణయించింది.
శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సాంకేతికతతో పనిచేసే ఈ ఫోన్ ద్వారా సాధారణ మొబైల్ నెట్వర్క్ లేకున్నా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు, అడవులు, సముద్ర ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ కొనసాగుతుంది.
విపత్తు నిర్వహణ బృందాలు, భద్రతా సంస్థలు, దూర ప్రాంతాల్లో పనిచేసే అధికారులు, పరిశోధనా బృందాలు, సముద్రయాన సిబ్బందికి ఈ శాటిలైట్ ఫోన్ ఉపయోగకరంగా ఉండనుంది. సాధారణ మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఇది నేరుగా శాటిలైట్తో అనుసంధానమై పనిచేయడం దీని ప్రత్యేకత.