www.ntodaynews.com
తాళ్ళరాంపూర్ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన డోంకేశ్వర్ మండల సర్పంచులు
తెలంగాణ
/
నిజామాబాద్
/
ఆర్మూర్
డోంకేశ్వర్: తాళ్ళరాంపూర్ సర్పంచ్ బెజ్జోరా పావని గారి కుటుంబాన్ని డోంకే శ్వర్ మండల సర్పంచులు పరామర్శించారు. పావని గారి భర్త, పిల్లలను ఓదారుస్తూ వారికి మనోధైర్యాన్ని అందించారు. ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి డోంకేశ్వరం మండల సర్పంచులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అనంతరం ఆ కుటుంబానికి రూ. 50,000 (యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మండల సర్పంచులు ఫోరం అధ్యక్షులు బట్టు సంజీవరాజ్, అల్లారి గంగాధర్, మూడు ప్రకాష్, రాజారెడ్డి, తోగరి మహేష్, వేముల దశరథ్, గడ్డం చిన్నారెడ్డి, బైండ్ల శ్రీకాంత్, రాచర్ల భూమన్న, అరే గంగాధర్, అట్టోలి సంజీవ్, బానోత్ సుమన్ మరియు బరికుంట సుమలత తదితరులు పాల్గొన్నారు.