www.ntodaynews.com
అద్దె భవనాలకు చెక్.. 4,794 కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం
ఆంధ్రప్రదేశ్
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 4,794 కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.193 కోట్లు విడుదల చేసింది. వీటిని వీబీజీ రామ్ జీ పథకానికి అనుసంధానం చేసి నిర్మించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 55,754 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 23,407 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త భవనాల నిర్మాణంతో అద్దె భవనాలపై ఆధారపడే కేంద్రాల సంఖ్య తగ్గి, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.