BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

దస్తావేజులు పెండింగ్లో ఉంచితే చెక్ స్లిప్ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 12:40 PM
78 వీక్షణలు

అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏదైనా దస్తావేజును పెండింగ్‌లో ఉంచాల్సి వస్తే తప్పనిసరిగా లిఖితపూర్వకంగా చెక్ స్లిప్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెక్ స్లిప్ ఇవ్వకుండా లేదా కార్డ్ 2.0లో నమోదు చేయకుండా అనధికారికంగా దస్తావేజులను పెండింగ్‌లో ఉంచితే దానిని తీవ్రమైన సేవా లోపంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

సీఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధిక సంఖ్యలో దస్తావేజులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పెండింగ్ విధానాన్ని రద్దు చేస్తూ, కాలపరిమితితో కూడిన కొత్త విధివిధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన రిజిస్ట్రేషన్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.