www.ntodaynews.com
పవన్ కల్యాణ్కు విజయవంతమైన భుజం శస్త్రచికిత్స
ఆంధ్రప్రదేశ్
ముంబైలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుడు డా. దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్య బృందం సుమారు మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది.
శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ను ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్కు తరలించినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని, అనస్తీషియా ప్రభావం నుంచి క్రమంగా బయటకు వస్తున్నారని తెలిపింది.
వైద్యుల సూచనల మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.