BREAKING
వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు
www.ntodaynews.com

విద్యుత్ షాక్ తో రైతు మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
11 Jul, 2026 - 08:14 PM
486 వీక్షణలు

వ్యవసాయ బావి వద్ద పైపు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతి చెందిన విషాద సంఘటన రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.​ఎస్ఐ జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం కుంకుడుపాముల గ్రామానికి చెందిన గొలుసుల వెంకన్న (38) వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఎప్పటిలాగే శనివారం ఉదయం 6 గంటల సమయంలో వెంకన్న తన పొలానికి వెళ్లాడు. అక్కడ బోరు మోటారుకు ఊడిపోయిన పైపును అమర్చే క్రమంలో, ప్రమాదవశాత్తు మోటారుకు ఉన్న విద్యుత్ వైరు తగిలింది.

​దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురైన వెంకన్న గట్టిగా అరుస్తూ కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు  కోల్పోయాడని మృతుడి భార్య గొలుసుల శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు   కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. యువ రైతు మృతితో కుంకుడుపాముల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.