BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

విద్యుత్ షాక్ తో రైతు మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
11 Jul, 2026 - 08:14 PM
88 వీక్షణలు

వ్యవసాయ బావి వద్ద పైపు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతి చెందిన విషాద సంఘటన రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.​ఎస్ఐ జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం కుంకుడుపాముల గ్రామానికి చెందిన గొలుసుల వెంకన్న (38) వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఎప్పటిలాగే శనివారం ఉదయం 6 గంటల సమయంలో వెంకన్న తన పొలానికి వెళ్లాడు. అక్కడ బోరు మోటారుకు ఊడిపోయిన పైపును అమర్చే క్రమంలో, ప్రమాదవశాత్తు మోటారుకు ఉన్న విద్యుత్ వైరు తగిలింది.

​దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురైన వెంకన్న గట్టిగా అరుస్తూ కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు  కోల్పోయాడని మృతుడి భార్య గొలుసుల శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు   కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. యువ రైతు మృతితో కుంకుడుపాముల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.